రణ్ వీర్ వల్లే ప్రాజెక్ట్ ఆగిపోయింది... ప్రశాంత్ వర్మ పోస్ట్...

హనుమాన్ ' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్కాంబినేషన్ లో ' రాక్షస్ ' ప్రాజెక్ట్ రాబోతుందని చర్చ జరిగింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.

Update: 2024-07-09 17:20 GMT

దిశ, సినిమా: 'హనుమాన్ ' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్కాంబినేషన్ లో ' రాక్షస్ ' ప్రాజెక్ట్ రాబోతుందని చర్చ జరిగింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అంతేకాదు అటు ప్రశాంత్ వర్మ, ఇటు రణ్‌వీర్ సింగ్‌ ఈ చిత్రం చేయాల్సిన సమయం ఇది కాదని అందరం సంయుక్తంగా తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఫ్యూచర్ లో కచ్చితంగా కలిసి పని చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు.

అయితే ఈ ప్రకటన తర్వాత ప్రశాంత్ వర్మ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రిజెక్షన్ అనే కాన్సెప్ట్ తో ఓ ట్వీట్ చేశాడు. 'ప్రతి తిరస్కరణ మారువేషంలో ఆశీర్వాదం అవుతుందని ఒక రోజు తెలుసుకుంటారు' అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ రణ్‌వీర్ గురించే పెట్టాడని.. ఈ ప్రాజెక్ట్ ఆయన చేయనని చెప్పడం వల్లే ఆగిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. బి టౌన్ లోనూ దీనిపై డిస్కషన్ జరుగుతుండటం విశేషం.


Similar News