రామోజీరావు కోసం తనకు ఎంతో ఇష్టమైన దానిని వదులుకున్న పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్!

దిగ్గజ వ్యాపార వేత్త రామోజీరావు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో ఈయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో మంది తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, జనసేన

Update: 2024-06-08 07:12 GMT

దిశ, సినిమా : దిగ్గజ వ్యాపార వేత్త రామోజీరావు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో ఈయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో మంది తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను తీవ్ర ద్రిగ్భాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.

ఇక 20 ఏళ్ల క్రిత ఈటీవీ వేడుకల్లో పాల్గొన్న పవన్ రామోజీరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. మా అన్నయ్య చిరుకు ఉత్తమ నటుడిగా సితార అర్డు వచ్చింది, ఈవెంట్ రామోజీరావు చాలా అద్భుతంగా నిర్వహించారని తెలిసింది. అప్పుడే ఆయన పేరు మొదటి సారి విన్నాను. తన గురించి తెలుసుకున్నాను. చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని ఈయన ఈ స్థాయికి చేరారు అంటూ రామోజీరావు గొప్పతనాన్ని పొగిడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా, ఆ వేదికపై ఆయన ఓ షాకింగ్ విషయాన్ని కూడా వెళ్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఫిల్మ్ సిటీ కట్టాలనేది తన కల అని , కానీ రామోజీరావు లాంటి ఉన్నతమైన వ్యక్తి ఫిల్మ్ సిటీ నిర్మిస్తున్నారని తెలియగానే తన కలను వదిలేసుకున్నట్లుగా ఆయన తెలిపారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.


Similar News