నీతో నిమగ్నమయ్యా.. యంగ్ హీరోయిన్ పోస్ట్ వైరల్

యంగ్ హీరోయిన్ ప్రిషా సింగ్ నిఖిల్ ‘స్పై’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Update: 2024-07-04 15:29 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ప్రిషా సింగ్ నిఖిల్ ‘స్పై’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రెహ్మాన్ కూతురుగా అలరించిన ఈమె.. మొదటి మూవీతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ‘బడ్డీ’ చిత్రంలో కూడా అవకాశం అందుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

అంతే కాకుండా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. కుర్రాళ్లను అట్రాక్ట్ చేసేపనిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పిక్స్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ టైట్ ఫిట్‌లో అందాలు చూపిస్తూ.. ‘నీలో నిమగ్నమయ్యా’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ప్రిషా సింగ్ ఫొటోస్‌పై.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Similar News