మేము ఎవరికి పుట్టామని అడుగుతున్న కన్న పిల్లలు.. సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రముఖ డైరెక్టర్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పెళ్లి చేసుకోలేదు కానీ పిల్లలకు తండ్రి అయ్యాడు. సరోగసి ద్వారా ఇద్దరు చిన్నారులకు వెల్ కమ్ చెప్పిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.

Update: 2024-07-09 08:06 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ పెళ్లి చేసుకోలేదు కానీ పిల్లలకు తండ్రి అయ్యాడు. సరోగసి ద్వారా ఇద్దరు చిన్నారులకు వెల్ కమ్ చెప్పిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఒక్కడే పిల్లల బాధ్యతలు మోస్తుండగా.. సింగిల్ పేరెంట్ గా ఉండటం చాలా కష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పిల్లల నుంచి సమాధానం లేని ప్రశ్నలు వస్తున్నాయని బాధపడ్డాడు. జనరేషన్ మారుతుందని, మోడ్రన్ సొసైటీ వస్తుందని ఇలాంటి సాహసం చేశాను కానీ ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని అంటున్నాడు.

2017లో సరోగసీ ద్వారా పుట్టిన యశ్, రూహీని కరణ్ తల్లి దగ్గరుండి చూసుకుంటుంది. కొడుకుతోపాటు మనవడు, మనవరాలికి కూడా అమ్మ అయింది. కానీ తాము ఎవరి కడుపులో నుంచి పుట్టామనే ప్రశ్న ఎప్పుడు అడుగుతూనే ఉన్నారని బాధపడ్డాడు కరణ్. తను ఎంత గొప్పగా చూసుకున్నా.. వారికి సొంత తల్లి కావాలని, ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆశ పడుతున్నారని చెప్పుకొచ్చాడు. కానీ ఇదంతా సాధ్యమయ్యే పనిలాగా లేదు. ఎందుకంటే సరోగేట్ మదర్ ముందుగానే ఈ విషయాలు ఎవరికి చెప్పకూడదని అగ్రిమెంట్ తీసుకుంటుంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి.


Similar News