‘మీరు ఆమెను రేపు చూస్తారు’ ఇంట్రెస్టింగ్‌గా మూవీ పోస్టర్

‘మను’ ఫేమ్ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దాదాపు ఆరేళ్ల తర్వాత చిత్రీకరిస్తున్న సినిమా ‘8 వసంతాలు’.

Update: 2024-06-06 13:58 GMT

దిశ, సినిమా: ‘మను’ ఫేమ్ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దాదాపు ఆరేళ్ల తర్వాత చిత్రీకరిస్తున్న సినిమా ‘8 వసంతాలు’. న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మూత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇద్దరు ప్రమికుల మధ్య ఎనిమిదేళ్లలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి ‘365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం. అదే అనుభవాలతో కొలిస్తే.. ఒక వసంతం’ అని గతంలో రిలీజ్ చేసిన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మీరు తనని రేపు చూస్తారు’ అనే క్యాప్షన్ జోడిస్తూ రేపు ఉదయం 11:07లకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Similar News