ప్రతి ఒక్కరికి కూతురు ముఖ్యమే.. పవన్ కళ్యాణ్ కూతుళ్లపై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-03 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఒకప్పుడు తెలుగులో పలు చిత్రాల్లో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి వెళ్లి పోయారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ కొందరు హీరోలు, డైరెక్టర్‌ల గురించి తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ నిత్యం తెలుగు వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటారు. ఈ క్రమంలో ఈమె లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్ నెట్టింట కలకలం రేపుతున్నాయి.

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఇద్ద‌రు కూతుళ్లతో క‌లిసి తిరుమ‌ల వెళ్లిన విష‌యం తెలిసిందే. తన చిన్న కుమార్తె పొలెనా అంజనకి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ తీసుకున్నాడు. అనంత‌రం ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కూతుళ్లుతో ద‌ర్శ‌నం చేసుకోవ‌డంపై పూనమ్‌ కౌర్ ప‌రోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్‌ తిరుమల పర్యటన చేసిన నేపథ్యంలో ‘ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే’ అంటూ పూనమ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కూతుళ్ల‌తో క‌లిసి ప‌వ‌న్ రాజ‌కీయం చేస్తున్నాడ‌ని.. అందుకే ప‌వ‌న్ ఉద్దేశించే పోస్ట్ చేసింద‌ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.



Similar News