కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇండస్ట్రీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రిక్వెస్ట్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు అందరు ఖండిస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు అందరు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సినిమా ఇండస్ట్రీకి కీలక రిక్వెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించాలని ఆయన ఇండస్ట్రీని కోరారు. మంత్రి కొండా సురేఖ భేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వివాదంలో ఇరువైపులా ఉన్నది మహిళలే అని, ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే కేటీఆర్ సోషల్ మీడియాలో మహిళా మంత్రి మీద చేసిన ట్రోల్స్ కూడా సినిమా పెద్దలు గమనించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.