మోడీ ప్రభుత్వానికి రాజామౌళి సంచలన రిక్వెస్ట్.. కేంద్రానికి జక్కన్న చేసిన విజ్ఞప్తి ఏంటంటే..?

బహూబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కేంద్ర ప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్ చేశారు.

Update: 2024-06-27 13:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: బహూబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కేంద్ర ప్రభుత్వానికి కీలక రిక్వెస్ట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ రావుకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని జక్కన్న కోరారు. గురువారం విజయవాడలోని కానూరు అనుమోలు గార్డెన్స్‌లో రామోజీ రావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కన్న మాట్లాడుతూ.. రామోజీ రావు.. ఎన్నో శిఖరాలు అధిరోహించారని కొనియాడారు.

తెలుగు ప్రజలకు ఇంత సేవ చేసిన రామోజీ రావుకు మనమేం చేయగలమని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎంతో మందికి జీవనాధారం కల్పించిన రామోజీ రావుకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం సముచితం, సబబు అని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. సంస్మరణ సభ వేదికగా రామోజీ రావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని జక్కన్న అన్నారు. కాగా, వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం కారణంగా ఇటీవల రామోజీ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామోజీ రావు కుటుంబ సభ్యులు ఇవాళ విజయవాడలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.


Similar News