అక్షయ్ కుమార్ పేరు చెప్పి నిర్మాతలకు టోపీ పెట్టిన యంగ్ హీరోయిన్.. కోట్లలో ముంచింది..

యంగ్ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. సీనియర్ నటి జీనత్ అమన్ కు సంబంధించిన షో OTT ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు

Update: 2024-06-10 08:28 GMT

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. సీనియర్ నటి జీనత్ అమన్ కు సంబంధించిన షో OTT ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. అయితే ఇందులో భాగంగా ఉన్న దిగంగన.. ఈ ప్రాజెక్ట్ సమర్పకుడిగా సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ను సెట్ చేస్తానని నిర్మాత మనీష్ హరిశంకర్ తో డీల్ కుదుర్చుకుంది. MOU కూడా సెట్ చేయించింది. తర్వాత ఈ షోకు సంబంధించిన వీడియోను చూయించేందుకు అక్షయ్ దగ్గరకు వెళ్తానని.. ఆ కార్యక్రమం వీడియో ఉన్న ఐప్యాడ్ తీసుకుపోయింది. కానీ ఆయనను కలవలేదు. పైగా ఏం జరిగిందంటే అక్షయ్ కు రూ. 6 కోట్లు ఇస్తేనే సమార్పకుడిగా ఉంటానని చెప్పాడని తెలిపింది. కానీ అసలు ఆ ప్రయత్నం జరగకుండానే ఇన్ని డ్రామాలు ఆడుతుందని.. త్వరగానే కనిపెట్టాడు నిర్మాత.

అంతేకాదు షో ఆగిపోయిందని మీడియాకు స్టేట్మెంట్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాడు. తన బ్యానర్ పరువు ప్రతిష్టలు మంటగలిపిన ఆమెపై చీటింగ్ కేసు పెట్టారు. కాగా దిగంగన తెలుగులో సీటి మార్, వలయం, క్రేజీ ఫెలో, హిప్పీ సినిమాల్లో నటించింది.


Similar News