ఏపీ ఎన్నికల ఫలితాల్లో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే?

ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టీ చూస్తే కూటమి ముందంజలో కొనసాగుతోంది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Update: 2024-06-04 09:27 GMT

దిశ, సినిమా : ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టీ చూస్తే కూటమి ముందంజలో కొనసాగుతోంది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో అల్లుఅర్జున్‌పై ట్రోలింగ్ మొదలైంది. బన్నీకి బిగ్ షాక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే? ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయన స్నేహితుడు కావడంతో బన్నీ తనకు మద్దతు తెలిపానని చెప్పుకొచ్చాడు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఆయన నంద్యాల వెళ్లి తన స్నేహితుడు శిల్పా రవి తరఫున ప్రచారం చేశారు. అప్పట్లో ఇది చర్చానీయాంశంగా మారింది. నాగబాబు దీనిపై స్పందిస్తూ.. అల్లు అర్జున్ మనవాడే కానీ, పగోడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చే జరిగింది. జనసేన గెలుపు కోసం కాదు, వైసీపీ గెలుపు కోసమే బన్నీ ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆయనపై పవన్ అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైపోయింది. అటు బన్నీ సపోర్ట్ చేసిన శిల్పా రవిచంద్రా రెడ్డి వెనుకంజలో ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ సపోర్ట్ చేసినా ఆయన గెలవడం లేదు. బన్నీ అంత కష్టపడి అంతలా పర్యటించి శిల్ప రవికి సపోర్ట్ చేసినా ఏం ప్రయోజనం లేదు.. బన్నీ ప్రచారం చేయకున్నా గెలిచేవారేమో అంటూ అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News