రాజ్‌తరుణ్ లవ్ ఎపిసోడ్‌లో మరో బిగ్ ట్విస్ట్.. హీరో ప్రియురాలిపై కేసు పెట్టనున్న హీరోయిన్ మాల్వీ మల్హోత్రా..!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ లవ్ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. హీరో రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం

Update: 2024-07-06 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ లవ్ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. హీరో రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేసి.. మరో హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను శారీరకంగా వాడుకుని ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి నన్ను వదిలేశాడని లావణ్య ఆరోపించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజ్‌తరుణ్ లావణ్య పచ్చి అబద్దాలు చెబుతోందని ఆమె వ్యాఖ్యలను కొట్టి పారేశాడు.

లావణ్యతో గతంలో రిలేషన్ షిప్ ఉండేదని.. ఇప్పుడు ఆమెను పెళ్లి ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టాడు. ఈ క్రమంలో లావణ్య వ్యాఖ్యలపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అయ్యింది. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లావణ్య ఆరోపించినట్లుగా హీరో రాజ్‌తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం అతడు సహనటుడు మాత్రమేనని తేల్చి చెప్పింది. లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అని మండిపడింది. కేవలం తననే కాకుండా రాజ్‌తరుణ్‌తో సినిమాలో నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య అనుమానిస్తోందని ఫైర్ అయ్యింది.

లావణ్య నాకు మేసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని, నా తల్లిదండ్రులకు కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిందని తెలిపింది. లావణ్యతో నాకు ఎలాంటి పరిచయం లేదని, మేం ఆమెను బెదిరించినట్లు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమనీ చెప్పింది. షూటింగ్ తర్వాత 6 నెలలు రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేనని.. సినిమా ప్రమోషన్ కోసం రీసెంట్‌గా మాట్లాడానని.. దీంతో మళ్లీ అనుమానంతో లావణ్య మెసేజ్‌లు చేస్తోందని క్లారిటీ ఇచ్చింది. లావణ్య నాపై అసత్య ప్రచారం చేస్తోందని.. ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానని మాల్వీ మల్హోత్రా స్పష్టం చేసింది. కాగా, రాజ్ తరుణ్ హీరోగా మాల్వీ మల్హోత్రా హరోయిన్‌గా ‘తిరగబడరా సామీ’ అనే మూవీలో నటించారు.


Similar News