‘అల వైకుంఠపురములో’ మూవీలో చూపించిన ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..? దాని ఖరీదు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా కెరీర్‌లో ఎన్నో మూవీస్‌లో నటించాడు.

Update: 2024-10-05 04:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా కెరీర్‌లో ఎన్నో మూవీస్‌లో నటించాడు. అందులో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అలా హిట్ అయిన వాటిలో ‘అల వైకుంఠపురములో’ మూవీ ఒకటి. ఈ మూవీ 2020లో సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులోని సాంగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీలో చాలా వరకు కథ ఒక పెద్దింట్లో కొనసాగుతుంది. అందులో టబు అల్లు అర్జున్ తల్లిగా యాక్ట్ చేసింది. ఇక వారి ఇంటి పేరే వైకుంఠ పురం. అయితే వాస్తవానికి ఈ ఇల్లు ఎవరిది.. అనే విషయం చాలా మందికి తెలియదు. మరి ఈ ఇల్లు ఎవరిదో ఇప్పుడు మనం చూద్దాం..

అల వైకుంఠపురములో మూవీలో చూపించిన ఆ పెద్ద ఇల్లు ప్రముఖ న్యూస్ చానల్ ఎన్‌టీవీ(NTV) చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె రచన చౌదరి భర్తది. ఇక ఈ ఇంటి విలువ దాదాపుగా రూ.300 కోట్లు. కాగా ఈ ధర అప్పట్లో. ఇక ఇప్పుడు 4 ఏళ్లు గడిచిపోయాయి కనుక ధర ఇంకా పెరిగే ఉంటుంది. అయితే చాలా వరకు ఈ మూవీలోని సీన్స్ అన్ని ఈ ఇంట్లోనే చిత్రీకరించారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలాగే ఉంటాయి. ఈ క్రమంలోనే నగరంలో ఉన్న అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇదొకటని చెప్పవచ్చు. ఇక ఈ ఇంట్లో షూటింగ్ జరిగినప్పుడు అల్లు అర్జున్ ఈ ఇంటిని చూసి చాలా ఇష్టపడ్డాడట. ఇలాగే ఒక ఇల్లును కట్టుకోవాలని కూడా అనుకున్నాడట. మరి ఆయన కల నెరవేరిందో లేదో తెలియదు కానీ.. అల వైకుంఠపురములో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News