క్షమించమని కోరుకుంటున్న అనసూయ.. అసలేమైదంటే?

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తన విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా

Update: 2024-06-14 09:06 GMT

దిశ, సినిమా : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ తన విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప2 లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. తన లేటేస్ట్ హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తుంటుంది. అంతే కాకుండా కౌంటర్స్ ఇవ్వడం, విమర్శలు చేయడంలో కూడా ముందు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అనసూయ తన సోషల్ మీడియాలో ఎవరినీ క్షమాపన అడగ లేదు. కానీ మొదటి సారి ఆమె క్షమించండి అంటూ కోరింది. ఎందుకు అనుకుంటున్నారా? ఆమె తన పోస్టులో పని ఒత్తిడి కారణంగా నేను సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చాను, ఎలాంటి పోస్టులు పెట్టలేదు, అందుకు కాను ఫాలోవర్స్ నన్ను క్షమించాలి అంటూ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ మధ్య అనసూయ బుల్లితెరపై సందడి చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం.


Similar News