కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బన్నీ సతీమణి. . పంజాబీ డ్రెస్‌లో అర్హ క్యూట్ పిక్స్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-08-06 14:00 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె సినిమాల్లో నటించకున్నా హీరోయిన్ లెవల్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదిచుకుంది. తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తరచూ సోషల్ మీడియాలో అర్హ, అయాన్ క్యూట్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అరిస్తుంటుంది. అంతేకాకుండా స్నేహా కూడా అప్పుడప్పుడు గ్లామర్ ఫొటో షూట్లు చేస్తూ యంగ్ హీరోయిన్‌ లుక్‌‌లో యువతను ఫిదా చేస్తుంటుంది. అయితే తాజాగా స్నేహా రెడ్డి మంగళవారం (ఆగస్టు 6) తన పిల్లల(అర్హ, అయాన్)తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్లింది.

అక్కడ ఆలయ అధికారులు స్నేహారెడ్డికి మర్యాదిస్తూ స్వాగతం పలికారు. బన్నీ సతీమణి స్వామి వారికి మొక్కులు చెల్లించారు. దర్శనం అయ్యాక ఆయల అర్చకులు స్నేహాకు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం కంప్లీట్ అయ్యాక గుడి లోపల నుంచి బయటకొచ్చాక మీడియా వాళ్లు స్నేహా దగ్గరకొచ్చి పలు ప్రశ్నలు అడిగారు. కానీ స్నేహా రెడ్డి ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం తిరుమల వారిని దర్శించుకున్న అల్లు స్నేహా రెడ్డి, క్యూట్ అర్హ, అయాన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Tags:    

Similar News