పూరి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అకీరా.. క్లారిటీ ఇస్తూ కామెంట్ చేసిన రేణుదేశాయ్!

ప్రస్తుతం అందరి చూపు అకీరా వైపే ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తర్వాత ఆ ఫ్యామిలీ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా అకీరా చాలా సంతోషం వ్యక్తం చేశారు.

Update: 2024-06-09 07:14 GMT

దిశ, సినిమా : ప్రస్తుతం అందరి చూపు అకీరా వైపే ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తర్వాత ఆ ఫ్యామిలీ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా అకీరా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు పవన్‌ వెన్నంటే ఉంటున్నాడు. ఎక్కడ చూసినా పవన్‌తో పాటు అకీరా కూడా దర్శనం ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అది ఏమిటంటే? అకీరా హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడంట. అంతే కాకుండా ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ అకీరాను ప్రమోట్ చేస్తున్నారు. చంద్రబాబును కలిసిన సమయంలో అకీరాతో వెళ్లడం, మోడీని కలిసిన సమయంలో అకీరాను తీసుకెళ్లడం వెనుక ఉన్న రహస్యం ఇదే. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో పవన్ అకీరాను ప్రమోట్ చేస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై స్పందిచిన రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అకీరా సినిమాల్లోకి రావడానికి ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. వాళ్ల నాన్న గెలవడం చూసి తన వద్దకు వెళ్లాడు అకీరా అంతే. ప్రస్తుతం వాళ్ల డాడీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దీనిని మీరు సినిమాల్లోకి రావాలనే ప్రమోట్ చేస్తున్నారు అనడం మాత్రం తప్పు, అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడం నాకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయమే, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నారు. తాను సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటే, నేను అధికారికంగా ప్రకటిస్తాను అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Similar News