షాకింగ్.. షూటింగ్ మధ్యలోనే చనిపోయిన హీరోయిన్.. హీరో చేసిన పనికి మూవీ యూనిట్ షాక్

కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అదిత్ అరుణ్.. హీరోయిన్ జెనీలియాతో కలిసి మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు తీసినా వర్క్ అవుట్ కాలేదు

Update: 2024-05-21 02:48 GMT

దిశ, సినిమా : ' కథ ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అదిత్ అరుణ్.. హీరోయిన్ జెనీలియాతో కలిసి మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు తీసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. కాగా ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు హీరో. అసలు సినిమాలు చేయకపోవడానికి కారణాలు చెప్పుకొచ్చాడు.

ఒక మూవీ కోసం రెండేళ్లు స్పెండ్ చేశానని తెలిపాడు. హోమ్ టౌన్ నుంచి కశ్మీర్ వరకు నడుస్తూ వెళ్లడమే సినిమా కాగా 60శాతం కంప్లీట్ అయినట్లు వివరించాడు. ఇలా షూటింగ్ జరుగుతుండగానే హీరోయిన్ అనారోగ్యం కారణంగా చనిపోయిందని తెలిపాడు. దీంతో ఏం చేయాలో తోచలేదు. మరొకరు ఆమె ప్లేస్ లో చేయలేరు. మళ్ళీ రీషూట్ చేసే బడ్జెట్ లేదు. అలాంటి ఆలోచనలతోనే ఏడు నెలలు గడిచిపోయాయి. మూవీ యూనిట్ తనను చూసి షాక్ అయ్యారని తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ కు కమిట్ అయి ఆఫర్లు వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఖాళీగా ఉండాల్సి వచ్చిందని తెలిపాడు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ అలాగే షెల్ఫ్ లో ఉందని చెప్పుకొచ్చాడు అరుణ్.


Similar News