హీరోయిన్ గొంతు పిసికిన నటుడు.. డైరెక్టర్ అడ్డుకోవడంతో సీన్ రివర్స్..

మల్లికా షెరావత్, ఇమ్రాన్ హష్మీ, అష్మిత్ పటేల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం మర్డర్. అయితే ఇందులో అష్మిత్..

Update: 2024-06-10 08:25 GMT

దిశ, సినిమా: మల్లికా షెరావత్, ఇమ్రాన్ హష్మీ, అష్మిత్ పటేల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం మర్డర్. అయితే ఇందులో అష్మిత్.. మల్లిక గొంతు పట్టుకునే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ పూర్తి చేశాక తన గొంతు పిసికానని డ్రామాలు చేసిందని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహేష్ భట్ తనను పిలిచి సారీ చెప్పమని అన్నాడని.. కానీ తాను ఊరుకోలేదన్నాడు. మానిటర్ చూడమని, ఎవరిది తప్పు అయితే వాళ్లు క్షమాపణ చెప్పాలని అన్నానని తెలిపాడు.

ఇక మూవీ ప్రమోషన్స్ టైంలోనూ ఇమ్రాన్, తాను కాకుండా మల్లిక లైమ్ లైట్ లో ఉండేందుకు తెగ ట్రై చేసేదని చెప్పాడు అష్మిత్. భట్ కూడా తనను మాత్రమే పొగిడేలా.. తనే సినిమాకు ఇంపార్టెంట్ అనేలా చేసేసిందని తెలిపాడు. పీఆర్ స్టంట్స్ ఆమెకు బాగా తెలుసని విమర్శించాడు. నిజానికి ఆమె చూసేంత మంచిది కాదని.. ప్రతి విషయంలో ఏదో ఒక గొడవ చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అటు మల్లిక, ఇమ్రాన్ మధ్య కూడా వైరం నెలకొనగా.. ఈ మధ్యే ఓ పెళ్లిలో దీనికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది.


Similar News