"వ్యాక్సిన్ వచ్చే వరకు నియంత్రణ అవసరం'

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. జీహెచ్ఎంసీ కార్మికులకు దిల్ రాజు శానిటైజర్లు, మాస్క్‌లను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఇండ్లకే పరిమితమైనా.. కార్మికులు మనందరి కోసం విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. మన కోసం కష్టపడుతున్న వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని దిల్ రాజు తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత […]

Update: 2020-04-15 06:20 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. జీహెచ్ఎంసీ కార్మికులకు దిల్ రాజు శానిటైజర్లు, మాస్క్‌లను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఇండ్లకే పరిమితమైనా.. కార్మికులు మనందరి కోసం విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. మన కోసం కష్టపడుతున్న వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని దిల్ రాజు తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ స్వీయ నియంత్రణ తప్ప వేరే మార్గం లేదని, ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని వారు కోరారు.

tags : GHMC, Mayor, Dil Raju, Sanitisers, Masks

Tags:    

Similar News