రవితేజ "ఖిలాడి" తరువాత మూవీ అదేనట..

దిశ, వెబ్ డెస్క్ : మాస్ రాజా రవితేజ ఈ సంవత్సరం మొదటిలోనే “క్రాక్” సినిమాతో హిట్ అందుకున్నాడు. రవితేజ కెరియర్లోనే అత్యంత అధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా “క్రాక్” నిలిచింది. ‘ఖిలాడి’ సినిమా షూటింగుతో బిజీ బిజీగా ఉన్న ఆయన, దర్శకుడు త్రినాథరావు నక్కినతో తరువాత ప్రాజెక్టును చేయాల్సి ఉంది. కానీ శరత్ మండవ వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ కథ చెప్పడంతో వెంటనే రవితేజ ఒప్పేసుకున్నారట. తనకు ఉన్న కమిట్మెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని […]

Update: 2021-04-15 01:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాస్ రాజా రవితేజ ఈ సంవత్సరం మొదటిలోనే “క్రాక్” సినిమాతో హిట్ అందుకున్నాడు. రవితేజ కెరియర్లోనే అత్యంత అధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా “క్రాక్” నిలిచింది. ‘ఖిలాడి’ సినిమా షూటింగుతో బిజీ బిజీగా ఉన్న ఆయన, దర్శకుడు త్రినాథరావు నక్కినతో తరువాత ప్రాజెక్టును చేయాల్సి ఉంది. కానీ శరత్ మండవ వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ కథ చెప్పడంతో వెంటనే రవితేజ ఒప్పేసుకున్నారట.

తనకు ఉన్న కమిట్మెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని 30 రోజుల్లో తన పోర్షన్ కథను పూర్తి చేయాలని షరతు కూడా పెట్టారంట. అంతేకాక ఈ సినిమాకు రూ.8 కోట్ల పారితోషికం అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ సరసన “మజిలీ”ఫేమ్ దివ్యాన్ష కౌశిక నటించబోతుంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్న శరత్ మండన ఈ చిత్రాన్ని ఎంతో ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

 

Tags:    

Similar News