మహిళకు నరకం చూపించిన మాజీ ఉపసర్పంచ్.. 16 నెల‌ల నుంచి అదే పనిలో ఉన్న కామాంధుడు

దిశ, వెబ్ డెస్క్: 16 నెలల నుంచి ఓ మహిళపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజ్ పాల్ సింగ్ కు చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఆ తర్వాత అతను మధ్యవర్తుల సాయంతో 16 నెలల కిందట ఓ మహిళను కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ మహిళపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు […]

Update: 2021-11-12 21:26 GMT

దిశ, వెబ్ డెస్క్: 16 నెలల నుంచి ఓ మహిళపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజ్ పాల్ సింగ్ కు చెందిన ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఆ తర్వాత అతను మధ్యవర్తుల సాయంతో 16 నెలల కిందట ఓ మహిళను కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ మహిళపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు అతడి భార్య కూడా సహకరించింది. గర్భం దాల్చిన బాధితురాలు అక్టోబర్ 25న ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంలో బాధితురాలు స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా భావించిన దుండగుడు శిశువును తన వద్దే ఉంచుకుని బాధితురాలిని బస్టాండ్ వద్ద వదిలి వెళ్లాడు. దీంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఒకడు రేప్ చేస్తే మరొకడు వీడియోలు తీశాడు.. వాటిని కాబోయే భర్తకు సెండ్ చేశాడు

Tags:    

Similar News