నిజాలను నిరాకరిస్తున్నాడు

Poem

Update: 2024-09-15 18:45 GMT

ఆపద వచ్చినప్పుడే

మనిషి ప్రవర్తన మారినట్టు

ఏది శాశ్వతము కాదని

నిజం అప్పుడే తెలిసినట్టు

ఆపదలో చిక్కుకొని

ప్రాణాపాయం తప్పదని తెలిసి

అందరం సమానమే అని

కులమత భేదం ఎందుకని

ప్రాణం మీదికి వస్తే కాని

వాస్తవాలు పలికినట్టు

నీటి బుడగ జీవితం

నిమిషంలో మటుమాయం అంటు

మాటలెన్నో చెపుతాడు

అన్ని చెప్పినా మనిషి

మనసు మాత్రం మారదెందుకో

కరోనా కళ్ళు తెరిపించినా

మనిషి మాత్రం మారలేదు

స్తోత్రం, మంత్రం, జపిస్తే

జీవితాలు మారతాయని

చెప్పేవన్నీ నిజమైతే

వరదలు ముంచెత్తినప్పుడు

ఆస్తినష్టం, ప్రాణనష్టం

జరుగకుండా ఆపాలి

ఏ శక్తి ఆపదని, అంతా అబద్దమని

మనిషికెప్పుడు తెలుస్తుందో....

ప్రకృతి ప్రళయం రూపం

కండ్ల ముందే జరుగుతున్నా

ఏది ఎప్పుడు జరుగుతుందొ

తెలియని మనిషి

ఇంకా నీది నాదని నీల్గుతుండు

వాస్తవం ఏమిటో తెలిసి కూడా

మూఢనమ్మకాల ఊబిలో పడి

నిజాలను నిరాకరిస్తున్నాడు

- నక్క కుమారస్వామి 

వంగపహడ్ -హన్మకొండ

Tags:    

Similar News

ఎర్ర శిఖరం!
బుల్డోజరు