Raitha side effects: రైతాతో భోజనం ముగిస్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెెలుసుకోవాల్సిందే

పెరుగుతో తయారు చేసే రైతా చాలా మంది ఇష్టంగా తింటారు.

Update: 2024-09-27 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతో తయారు చేసే రైతా చాలా మంది ఇష్టంగా తింటారు. భోజనంలో చివరగా రైతా వేసుకుని భోజనం ముగిస్తారు. అయితే పెరుగు, ఉల్లిపాయ రెండు వేరు వేరు స్వభావాలను కలిగి ఉంటాయి. కాగా కర్డ్‌లో ఉల్లిపాయ ముక్కల్ని కలిపి తింటే పలు సమస్యలు తలెత్తుతాయని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా హెల్తీగా ఉండటానికి పలు నియమాలు ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాగా నిపుణులు చెప్పినవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు, ఉల్లి కలిపి తినడం వల్ల అనర్థాలు..

పెరుగు, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఉల్లిపాయ వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటే.. పెరుగు ప్రభావం చల్లగా ఉండటంలో మేలు చేస్తుంది. అలాగే పెరుగులో కాల్షియం వంటి పోషకాలను గ్రహించడానికి ఉల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఆటంకం కలిగిస్తాయి. కాగా దీని కాంబినేషన్ వల్ల అనర్థాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రైతాను ఈ రకంగా తయారు చేసుకోండి..

ఉల్లి, పెరుగు కలిపి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుత్తాయి. అంతేకాకుండా ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వస్తాయి. సల్ఫర్ కారణంగా అతి వేడి ఉత్పత్తి అవుతుంది. టాక్సిస్ లెవల్ ను పెంచి.. స్కిన్ పై తామర, దద్దుర్లు, సోరియాసిస్ వంటి స్కిన్ అలెర్జీలను దారితీస్తుంది. అంతగా మీకు తినాలనిపిస్తే.. పెరుగు-ఉల్లిపాయ కాంబినేషన్ నచ్చితే ఉల్లిపాయల్ని ఆయిల్ లో కాస్త వేయించి.. చల్లారాక పెరుగులో కలిపి రైతా తయారు చేసుకోండి. ఫ్రై వల్ల హెల్త్ ను పాడుచేసే సమ్మేళనాల ప్రభావం తగ్గిపోతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News