మధుమేహం ఉన్నవారు పెరుగు తినడం మంచిదేనా..? నిపుణులు ఏం చెప్తున్నారంటే..

ప్రస్తుతం ఎక్కువమంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి.

Update: 2024-09-03 13:06 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కువమంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే మధుమేహం ఉన్నవారు పెరుగు తినవచ్చా? అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తుంటారు. కాగా కొన్ని రకాల హెల్తీ‌ఫుడ్స్ ద్వారా కూడా దీనిని నివారించడం, అదుపులో ఉంచుకోవడం సాధ్యం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా పెరుగు అందుకు సహాయపడుతుందని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు పేర్కొంటున్నారు.

స్వచ్ఛమైనది అయినప్పుడే..

ప్రతిరోజూ కనీసం రెండు కప్పుల పెరుగు తినడంవల్ల టైప్ -2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకుల అధ్యయనంలోనూ ఇది వెల్లడైంది. అయితే బాదం, కొబ్బరిపాలు వంటి ఇతర పదార్థాలు కలిపిన పెరుగు కాకుండా, స్వచ్ఛమైన పాలతో తయారైన పెరుగు మాత్రమే ఇటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు.

కార్బో హైడ్రేట్లు తక్కువ..

పెరుగులో అనేక పోషక గుణాలు ఉంటాయి. కార్బో హై‌డ్రేట్లు, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్సులిన్ సహాయం లేకుండా రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచగలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే షుగర్ పేషెంట్లు నిస్సందేహంగా పెరుగు తినవచ్చు అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు. 


Similar News