సిరాజ్కు బెస్ట్ ఫీల్డర్ మెడల్.. ఎవరు అందజేశారో తెలుసా?
గతేడాది వన్డే వరల్డ్ కప్ నుంచి భారత ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను అందజేస్తున్న విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ :గతేడాది వన్డే వరల్డ్ కప్ నుంచి భారత ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్ను అందజేస్తున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్లోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఐర్లాండ్పై గెలుపొంది పొట్టి ప్రపంచకప్లో గెలుపు ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్కుగానూ బెస్ట్ ఫీల్డర్ మెడల్ సిరాజ్కు దక్కింది. అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ కూడా పోటీపడగా.. సిరాజ్ మెడల్ గెలుచుకున్నట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రకటించాడు. ఆ వీడియోను బీసీసీఐ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఈ సారి వినూత్నంగా ఓ యువ భారత అభిమాని మెడల్ అందజేయడం విశేషం. పేసర్ అర్ష్దీప్ సింగ్ను కలవడానికి వచ్చినట్టు ఆ కుర్రాడు తెలిపాడు. స్పినర్ యుజువేంద్ర చాహల్ ఆ కుర్రాడిని వెంట తీసుకరాగా.. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ ఎవరా? ఆ స్పెషల్ గెస్ట్ అని ఆశ్చర్యపోవడం వీడియోలో కనిపించింది. అర్ష్దీప్కు కంగ్రాట్స్ చేసిన ఆ కుర్రాడు.. సిరాజ్కు మెడల్ అందించాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో మూడు ఓవర్లు వేసిన సిరాజ్ 13 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే, 16వ ఓవర్లో సిరాజ్ అద్భుతమైన ఫీల్డింగ్తో డెలానీ రనౌటయ్యాడు.