ఏపీలో శిల్పారామాలకు నిధులు మంజూరు

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం, తిరుపతిలో శిల్పారామాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం రూ.10 కోట్లు, శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా రూ.3 కోట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంజూరు చేసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.

Update: 2020-10-03 11:53 GMT

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం, తిరుపతిలో శిల్పారామాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం రూ.10 కోట్లు, శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా రూ.3 కోట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంజూరు చేసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.

Tags:    

Similar News