ఆస్పత్రికి వెళ్తూ అనంత లోకాలకు

దిశ, కామారెడ్డి : ఓ వ్యక్తిని మృత్యువు మరణించేదాకా వెంటాడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం అంబులెన్సులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ బోల్తాపడి మృతి చెందాడు. ఆయనతో పాటు మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయ సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రాంసింగ్(65) గా గుర్తించారు. పోలీసులు […]

Update: 2021-08-14 10:59 GMT

దిశ, కామారెడ్డి : ఓ వ్యక్తిని మృత్యువు మరణించేదాకా వెంటాడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం అంబులెన్సులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ బోల్తాపడి మృతి చెందాడు. ఆయనతో పాటు మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయ సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రాంసింగ్(65) గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన రాంసింగ్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి రాంసింగ్ ను తీసుకొని భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ప్రైవేట్ అంబులెన్సు లో బయలుదేరారు. సరిగ్గా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయ సమీపంలోకి రాగానే అంబులెన్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో రాంసింగ్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య లక్ష్మి, కొడుకులు శంకర్, మోతీరాంలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News