ప్రియురాలి కోసం ఫ్రెండ్ హత్య

దిశ, వెబ్‎డెస్క్ : ప్రియురాలి కోసం తన స్నేహితుడికి విషం తాగించాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యడ్లపాడుకు చెందిన గోపివర్మ, సమీపంలోని మర్రిపాలెనికి చెందిన కొమ్మూరి ప్రేమ్‏‎చంద్ స్నేహితులు. ఓ యువతితో ప్రేమలో పడిన ప్రేమ్‏‎చంద్ తరచూ ఆమెతో ఫోన్‎లో మాట్లాడేవాడు. తనకు ఫోన్ లేకపోవడంతో తన ఫ్రెండ్ గోపీ ఫోన్ నుంచి మాట్లాడేవాడు. ఈ క్రమంలో ప్రియురాలు తనకు తెలియకుండా గోపీతో మాట్లాడుతున్నాడని గుర్తించి […]

Update: 2020-10-10 03:02 GMT

దిశ, వెబ్‎డెస్క్ : ప్రియురాలి కోసం తన స్నేహితుడికి విషం తాగించాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. యడ్లపాడుకు చెందిన గోపివర్మ, సమీపంలోని మర్రిపాలెనికి చెందిన కొమ్మూరి ప్రేమ్‏‎చంద్ స్నేహితులు. ఓ యువతితో ప్రేమలో పడిన ప్రేమ్‏‎చంద్ తరచూ ఆమెతో ఫోన్‎లో మాట్లాడేవాడు. తనకు ఫోన్ లేకపోవడంతో తన ఫ్రెండ్ గోపీ ఫోన్ నుంచి మాట్లాడేవాడు. ఈ క్రమంలో ప్రియురాలు తనకు తెలియకుండా గోపీతో మాట్లాడుతున్నాడని గుర్తించి గొడవపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం శత్రుత్వంగా మారింది. కోపంతో రగిలిపోయిన ప్రేమ్‏‎చంద్ గోపీను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

యడ్లపాడు నుంచి నాదెండ్ల వెళ్లే రోడ్డులో ఉన్న చప్టా వద్దకు గోపీవర్మను రప్పించాడు ప్రేమ్‏‎చంద్. ఇద్దరం కలిసి చనిపోదామని గోపీని నమ్మించిన ప్రేమ్‏‎చంద్.. గడ్డిమందు కలిపిన కూల్‎డ్రింక్‎ను తాగించి ప్రేమ్‎చంద్ పరారయ్యాడు. దీంతో గోపీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 7వ తేదీన మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‎కు తరలించగా.. శనివారం ఉదయం గోపి మృతి చెందాడు. గోపీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ్‏‎చంద్‎ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News