Tirumala Updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ తగ్గింది.

Update: 2025-01-08 03:46 GMT
Tirumala Updates: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి గంట సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగా దర్శనమిస్తుండటంతో భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు. బుధవారం స్వామి వారిని 62,566 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 16,021 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.2 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు. 

Tags:    

Similar News