Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

వరుస సెలవులు వస్తుండటంతో గత కొన్ని రోజులుగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Update: 2025-03-19 06:39 GMT
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వరుస సెలవులు వస్తుండటంతో గత కొన్ని రోజులుగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం కూడా భక్తులు శ్రీవారి దర్శనం కోసం భారీగా వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న స్వామివారిని 65,487 మంది భక్తులు దర్శించుకోగా, 23,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లుగా ఉంది.  

Tags:    

Similar News