తిరుమలలో మరో మూడు నెలలు రద్దీ.. టీటీడీ కీలక వ్యాఖ్యలు

రానున్నవి వేసవి సెలవులు కావడంతో మరో మూడు నెలల తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది.

Update: 2023-03-28 02:15 GMT

దిశ, వెబ్ డెస్క్: రానున్నవి వేసవి సెలవులు కావడంతో మరో మూడు నెలల తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రజాప్రతినిధులెవరూ సిఫార్సు లేఖలు ఇవ్వవద్దంటూ టీటీడీ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ మూడు నెలల పాటు తిరుమల కొండపై రద్దీ అత్యధికంగా ఉండనుందనే అంచనాలతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలలో కేవలం నలభై వేల మందికి మాత్రమే వసతి సౌకర్యం కల్పించే వీలున్నందున ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను ఇవ్వకూడదంటూ ప్రకటన చేసింది. 

Tags:    

Similar News