శంషాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

దిశ, శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముందు వెళ్తున్న డీసీఎంను వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. శంషాబాద్ సీఐ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం.. నార్సింగి వైపు నుంచి వెళ్తున్న లారీ (AP 27 TY 3085) ఇటుక బట్టీలకు అవసరమైన […]

Update: 2021-12-18 10:52 GMT

దిశ, శంషాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముందు వెళ్తున్న డీసీఎంను వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. శంషాబాద్ సీఐ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం.. నార్సింగి వైపు నుంచి వెళ్తున్న లారీ (AP 27 TY 3085) ఇటుక బట్టీలకు అవసరమైన మట్టి లోడుతో ప్రయాణిస్తుంది.

పెద్ద గోల్కొండ వైపు తిరుగుతుండగా ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. లారీ డ్రైవర్ అంగోటి కృష్ణ (36) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News