సీఎం వైఎస్ జగన్‌తో నూతన సీఎస్ సమీర్ శర్మ భేటీ

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా. సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. […]

Update: 2021-10-01 02:58 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా. సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సీఎస్‌గా పదవీ విరమణపొందిన ఆదిత్యనాథ్‌ దాస్ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags:    

Similar News