Momos తిని మహిళ మృతి.. ఆసుపత్రి పాలైన మరో 20 మంది

Update: 2024-10-28 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లో మోమోస్ (Momos) తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ (Banjarahills)లోని నందినగర్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఈ ఘటనకు ఫుడ్ పాయిజన్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 


Similar News