నగల కోసం మహిళ హత్య..

నగల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన

Update: 2024-09-24 12:39 GMT

దిశ,దుండిగల్ : నగల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బొద్దుల శారద(50) కి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. కూతురుకు వివాహం అయ్యింది.మల్లంపేట లోని శామీర్ పేట ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటూ మల్లంపేట ఇందిరమ్మ ఇళ్ల దగ్గర విఘ్నేశ్వర మిల్క్ బూత్ ని నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది.ఈ నెల 23వ తేదీ రాత్రి 7.30 గంటలకు రోజు లాగే కుమారునితో కలిసి మిల్క్ బూత్ కి వెళ్ళింది.

కుమారుడు ఆఫీస్ కి వెళ్లగా రాత్రి 8.30 గంటలకు తిరిగి ఇంటికి వెళ్ళింది. రాత్రి 8.40 నిమిషాలకు కుమారుడు సాయి వినయ్ ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పక్క ఇంట్లో ఉండే నరేష్ కి ఫోన్ చేయగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సతీష్ తెలిపారు.ఒంటిపై ఉన్న చెవి కమ్మలు,ముక్కుపుడక కనిపించక పోవడం,మెడ,గొంతుపై గాయాలు ఉండడం,మంచంపై విగత జీవుగా పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. నగల కోసం గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉండవచ్చని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News