తీవ్ర జ్వరంతో బస్సులోనే మహిళ మృతి...

జ్వరంతో బాధపడుతున్న మహిళ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తూ బస్సులోనే ప్రాణాలు వదిలిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-10-24 08:53 GMT

దిశ, కమలాపూర్ : జ్వరంతో బాధపడుతున్న మహిళ ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తూ బస్సులోనే ప్రాణాలు వదిలిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన అంకిళ్ళ కవిత (36) నాలుగు రోజులుగా జ్వరంతో బాధ పడుతుండడంతో భర్త చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తిరిగి ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామానికి రాగానే భార్యను లేపడంతో ఎంతకీ లేవకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారించుకొని భర్త కన్నీటి పర్యంతమయ్యాడు.


Similar News