Tragic Incident:భర్త మృతి.. మరణమైనా నీతోనే అంటూ భార్య ఆత్మహత్య

కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు.

Update: 2024-10-09 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోటి కలలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ ప్రేమ జంట ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. విధి ఇద్దరినీ బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన నాగరాజు(29), ఉష(22) ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి 18 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. నాగరాజు ఓ హోటల్లో టిఫిన్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. నాగరాజు సోమవారం సాయంత్రం 6 గంటలకు పని కోసం బైక్ పై ప్రసాదంపాడుకు వెళ్లారు. ఈ క్రమంలో పని ముగించుకుని మంగళవారం వేకువజామున తిరిగి వస్తుండగా భానూనగర్ జంక్షన్ సమీపంలో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది.

ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని రక్తపు మడుగులో చూసిన ఉష గుండె తల్లడిల్లింది. గుండె నిండా దు:ఖాన్ని దిగమింగుకొని గుణదల పోలీస్ స్టేషన్లో ఉష ఫిర్యాదు చేసి, ఆమె తల్లి చల్లా ఆదిలక్ష్మితో ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తాము ఉండే ఇంటికి వెళ్లిన ఉష తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆదిలక్ష్మి వెళ్లి చూడగా ఉష ఫ్యాన్‌కు వేలాడతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాణసఖుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ ఉరి వేసుకుని చనిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ప్రేమ జంట కానరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News