ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 16వ డివిజన్ ధర్మారంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి పోలు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం

Update: 2024-10-06 14:34 GMT

దిశ,గీసుగొండ: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 16వ డివిజన్ ధర్మారంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి పోలు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... ధర్మారం గ్రామానికి చెందిన పోలు నారాయణ తన రెండవ కూతురైన కళ్యాణిని ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన మానగాని నాగరాజుతో 2012లో వివాహం చేశారు.వీరు బతుకుతెరువు కోసం ధర్మారం గ్రామానికి వచ్చి అద్దె ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కళ్యాణి భర్త నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. కళ్యాణి చేసిన కూలి డబ్బులను కూడా మద్యానికి వాడుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తాను కిరాయికి ఉంటున్న ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలు నారాయణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ బాబూలాల్ తెలిపారు.


Similar News