పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతి

పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-06 13:27 GMT

దిశ, వర్ధన్నపేట: పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన యువతి దౌత్ బాజీ శ్రావణి (17), యువరైతు కూకట్ల రాజు(25) వ్యవసాయ క్షేత్రం వద్ద పనులు చేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న క్రమంలో వారిపై పిడుగు పడగా, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సెలవులు కావడంతో శ్రావణి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిందని, లేకపోతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని కుటుంబసబ్యులు రోధిస్తున్నారు. ఇద్దరు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


Similar News