తీవ్ర విషాదం.. మరణంలోనూ వీడని కవలల బంధం

రెనోవేషన్ అవుతున్న ఫార్మా కంపెనీ లో ఉన్న సంపులో పడి ఇద్దరుబ

Update: 2024-10-16 13:48 GMT

దిశ, పేట్ బషీరాబాద్: రెనోవేషన్ అవుతున్న ఫార్మా కంపెనీ లో ఉన్న సంపులో పడి ఇద్దరు కవలలు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సబురి ఫార్మా కంపెనీ గత కొన్నాళ్లుగా మూతపడి ఉంది. దీనిని పునః ప్రారంభించేందుకు రెనోవేషన్ చేస్తున్నారు. ఇందుకుగాను ఫార్మా కంపెనీలో ఉన్న కెమికల్ సంపులు శుభ్రం చేసేందుకు అన్నదమ్ములైన రాము (32), లక్ష్మణ్ (32) (కవలలు) పూనుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు సంపులో పడిపోగా అతనిని కాపాడేందుకు మరొకరు ప్రయత్నించే క్రమంలో అతను కూడా సంపులో పడిపోయాడు. దీంతో బాధితులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఈ ఘటనలో మరొక వ్యక్తి సురేందర్ రెడ్డి సైతం గాయపడినట్లు తెలుస్తుంది.    


Similar News