Telugu Crime News : పండుగ పూట విషాదం

పండుగ పూట ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని చెట్టుకు ఢీకొట్టి మృతి చెందాడు.

Update: 2024-10-13 09:46 GMT

దిశ, శంకరపట్నం : పండుగ పూట ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని చెట్టుకు ఢీకొట్టి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ....చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన బండారిపల్లి వినయ్ (25) అనే యువకుడు దసరా పండుగకు తన పెద్దమ్మ ఇంటికి వస్తుండగా శనివారం రాత్రి తాడికల్ గ్రామ శివాలయం మూలమలుపు వద్ద అతివేగంగా చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు, స్థానికులు తెలిపారు.మృతుని తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు. 

Tags:    

Similar News