భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

మహారాష్ట్రలోని ముంబై(Mumbai) నగరంలో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది.

Update: 2024-10-16 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని ముంబై(Mumbai) నగరంలో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. బుధవారం మధ్యాహ్నం లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లతో కలిసి పోలీసు ఘటనా స్థలానికి వచ్చారు. మృతులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News