యువకుడిపై మూకుమ్మడి దాడి..మనస్తాపంతో..

దసరా పండుగ సందర్భంగా జరిగిన గొడవలో దాడికి గురైన ఓ యువకుడు

Update: 2024-10-15 12:33 GMT

దిశ,నెక్కొండ: దసరా పండుగ సందర్భంగా జరిగిన గొడవలో దాడికి గురైన ఓ యువకుడు మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెక్కొండ మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన కథనం ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్ రావుపేట గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గొడవ జరిగింది.అనంతరం అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు బరుపటి.గణేష్(22 సం"లు) అనే యువకుడిపై దాడి చేశారు.ఆ దాడితో మనస్తాపం చెందిన యువకుడు అదే రోజు రాత్రి తన ఇంటి స్లాబ్ పై గడ్డి మందు తాగాడు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్ కి తరలించారు.చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుమారు 7 గంటలకు మృతి చెందాడు.మృతుని తల్లి బరుపటి.కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఏడుగురు యువకులైన మచ్చ పృథ్వి,తాళ్ళ సతీష్, ఈసంపల్లి.ప్రవీణ్, కొయ్యల.సతీష్,తాళ్ళ.శ్రీను,జిల్లా సుమన్, కొయ్యల.సుమన్(చింటూ) అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News