ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి…అనంతలోకాలకు

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వెన్న చర్ల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-18 08:30 GMT

దిశ, నాగర్ కర్నూల్ /పెద్ద కొత్తపల్లి :- ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వెన్న చర్ల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు వివరాలు ప్రకారం....అదే గ్రామానికి చెందిన సందడి శైలేష్ (19) పంట పొలంలో పురుగు మందు పిచికారి చేసేందుకు తన ఇద్దరి స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా…ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. వెనకాల ఉన్న మరో ఇద్దరు యువకులు కిందికి దూకగా బైక్ నడుపుతున్న యువకుడు బస్సు కింద నలిగి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే 108 ని ఆశ్రయించగా సిబ్బంది వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


Similar News