Person Missing : టీ తాగేందుకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం..

టీ తాగేందుకు బయటికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన (missing ) సంఘటన దుబ్బాక ( Dubbaka )పట్టణంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-26 06:44 GMT

దిశ, దుబ్బాక : టీ తాగేందుకు బయటికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన (missing ) సంఘటన దుబ్బాక ( Dubbaka )పట్టణంలో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 17న ఉదయం బెల్లె భూమయ్య (50) అనే వ్వక్తి టీ తాగి వస్తానని ఇంట్లో తన భార్యకు చెప్పి వెళ్లి రాత్రి అయిన ఇంటికి తిరిగి రాలేదన్నారు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారని, అలాగే బంధువుల వద్దకు వెళ్ళి వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. దీంతో శనివారం దుబ్బాక పోలీస్ స్టేషన్లో బెల్లె భూమయ్య భార్య బెల్లె నర్సవ్వ ఫిర్యాదు ఇచ్చారని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Similar News