AP News:అత్త చెవిని అమాంతం కొరికేసిన కోడలు.. అతికించలేమన్న వైద్యులు.. ఆ తర్వాత ఏమైందంటే?

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో కలహాలు సహజమే.

Update: 2024-10-08 12:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో కలహాలు సహజమే. ఇక కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామన్ అయిపోయింది. కానీ ఆ గొడవలు శ్రుతి మించితేనే ప్రమాదం. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన అత్త చెవిని కొరికేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ఓ కోడలు అత్త చెవిని అతి దారుణంగా కొరికేసింది. జిల్లాలోని తుళ్లూరులో ఉంటున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో కోడలు పావనికి అత్త నాగమణి(55)కి గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవతో ప్రారంభమై అది పెద్దగా రాజుకుంది . ఈ గొడవలో క్షణికావేశానికి గురైన కోడలు అత్త చెవిని అతి దారుణంగా కోరికేయడంతో ఆ భాగం ఊడిపోయింది. ఆ తర్వాత తెగిపోయిన చెవితో అత్త నాగమణిని స్థానికులు తుళ్లూరు పీహెచ్‌సీకి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆలస్యం కావడంతో తెగిన చెవి అత్తుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ ఘటన పై బాధితుల ఫిర్యాదు మేరకు చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.


Similar News