గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

The body of an unidentified man was found

Update: 2024-10-08 13:02 GMT

దిశ,ఆమనగల్లు: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ కేంద్రంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్లు సమీపంలోని దుబ్బ గట్టు కొండపైకి మంగళవారం ఉదయం ఇద్దరు బాలురు సీతాఫలాలు వెతుకుతుండగా గుర్తుతెలియని మృతదేహం వారికి కనిపించింది. భయపడ్డ బాలురు గుట్ట నుండి కిందకు దిగి వారి కుటుంబ సభ్యులకు తెలుపగా, కుటుంబ సభ్యులు సైతం గుట్ట పైకి వెళ్లి మృతదేహాన్ని గమనించారు.

ఈ విషయం పోలీస్ అధికారులకు తెలుపగా, వెంటనే సీఐ ప్రమోద్ కుమార్, ఎస్సై వెంకటేష్ పోలీసు సిబ్బందితో కలిసి గుట్ట పైకి చేరుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ ప్రమోద్ కుమార్ తెలిపారు. మృతుడు (35)ప్యాంటు, చొక్కా ధరించి ఉన్నట్లు, మృతదేహం పక్కన వాటర్ బాటిల్,మోనోసిల్ పురుగుల మందు, మృతదేహం తల దిండుగా అడుగుభాగాన బ్యాగ్ ను గుర్తించినట్లు సిఐ తెలిపారు. వారం రోజుల కిందటే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహాన్ని అక్కడనుండి తరలించి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.


Similar News