ఉగ్రమూకల కిరాతకం.. ఆర్మీ జవాన్‌ని కిడ్నాప్ చేసి ఆపై కిరాతకంగా..

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంతనాగ్‌లో మంగళవారం ఇద్దరు జవాన్లు కిడ్నాప్ (Kidnap) అయిన విషయం తెలిసిందే.

Update: 2024-10-09 08:04 GMT
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని అనంతనాగ్‌లో మంగళవారం ఇద్దరు జవాన్లు కిడ్నాప్ (Kidnap) అయిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు జవాన్లలో ఓ జవాన్ (Jawan) ఉగ్రవాదుల చెర నుంచి ప్రాణాలతో తప్పించుకుని బయటపడగా.. తాజాగా బుల్లెట్ గాయాలతో ఛిద్రమైన రెండో జవాన్ మృతదేహం ఆర్మీకి లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ (Ananthanag) జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలోని షాంగస్ నుంచి ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను అక్టోబర్ 8న మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
అయితే ఇద్దరిలో ఓ జవాన్ మంగళవారం (Tuesday) అర్థరాత్రి సమయంలో ఉగ్రమూకల పట్టు నుంచి తప్పించుకుని సేఫ్‌గా ఆర్మీ బేస్‌కి తిరిగొచ్చాడు. దీంతో రెండో జవాన్ కోసం ఆర్మీ అధికారులు (Army Officials) పెద్ద ఎత్తున గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు బుధవారం (Wednesday) ఉదయం రెండో జవాన్ మృతదేహం (Dead Body) ఆర్మీ అధికారులకు లభించింది. సదరు జవాన్ శరీరం బుల్లెట్ గాయాలతో నిండి ఉందని, ఉగ్రమూకలు తమ జవాన్‌ను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపినట్లు భావిస్తున్నామని ఆర్మీ వెల్లడించింది.

Similar News