అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇంటి నుంచి మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి చెరువులో శవమై తేలాడు.

Update: 2024-09-26 14:46 GMT

దిశ, పరిగి : ఇంటి నుంచి మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి చెరువులో శవమై తేలాడు. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం రాఘవాపూర్​ గ్రామానికి చెందిన మహమ్మద్​ నిజాముద్దీన్​ (47) వివాహం కాకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇంటి నుంచి వెళ్లి మూడు రోజులుగా కనిపించడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. చెరువు ఒడ్డున నిజాముద్దీన్​ వేసుకునే బట్టలు, టవల్, చెప్పులు విడిచి ఉండడం గ్రామస్తులు గమనించారు.

    దాంతో చెరువులోపల పరిశీలించగా నీటిపై శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రమేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. నిజాముద్దీన్​ మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. శవాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి పెద్దన్న మహమ్మద్ జాంగీర్ పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.  

Tags:    

Similar News