తల్లి కొడుకు ఆత్మహత్య

పురుగుల మందు తాగి తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-09-29 01:49 GMT

దిశ, సికింద్రాబాద్: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న నంపరి జయలక్ష్మి అలియాస్ బాలమణి (63) భర్త మృతి చెందడంతో కొడుకు నంపరి రవికాంత్ (36)తో కలిసి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇరుగు పొరుగు వారు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. వారసిగూడ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News