ఝరాసంగం లో తీవ్ర విషాదం.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-10-20 14:55 GMT

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఆదివారం సాయంత్రం ఝరాసంగం లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, ఎస్సై నరేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం గ్రామానికి చెందిన బొంతలి ప్రతాప్ సింగ్ (60), కళావతి (50) దంపతులు కేతకి ఆలయం ముందు హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ వ్యాపారం నడవడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో, మనస్థాపానికి గురై ఆదివారం సాయంత్రం వారి సొంత పొలం వద్ద పురుగుల మందు సేవించారు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించగా, స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. వారిని హుటాహుటిన 108 అంబులెన్స్ లో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఝరాసంగం ఎస్సై నరేష్ తెలిపారు.


Similar News